నెల్లూరు: నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్న నేపధ్యంలో, అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై నెల్లూరు నగర పాలక కమీషనర్ శ్రీమతి హరిత, ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కర్నల్ ఎస్. కోహ్లి తో కలసి శనివారం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు, అదేశాలిచ్చారు.ఈ సందర్భంగా నెల్లూరు నగర పాలక కమీషనర్ శ్రీమతి హరిత మాట్లాడుతూ, ఈ నెల 12 రోజుల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నెల్లూరు ఏ సి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతుందని, ఈ ర్యాలీకి సుమారు 38 వేల మంది అభ్యర్ధులు ఆన్ లైన్ లో తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని, రోజుకు 3 వేల మంది వంతున ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకు హాజరౌతారని తెలిపారు. అందుకనుగుణంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారుల సూచనల మేరకు బ్యారీకేడింగ్, లైటింగ్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్, పోలీసు బంధోబస్తు, శానిటేషన్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు తదితర విధులను సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా చేపట్టాలని కమీషనర్, అధికారులకు సూచించారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.