నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో జరగనున్న రీ సర్వే పనులలో అత్యాధునిక డిజిటల్ డ్రోన్ సేవలను వినియోగించుకుని రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు.నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, డ్రోన్ ఏజెన్సీ బృందంతో స్థానిక పోలీసు పెరేడు మైదానంలో డ్రోన్ ఫ్లై రీ సర్వేను కమిషనర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేటినుంచి జరగనున్న డ్రోన్ ఫ్లై భూసర్వే లో నగర పాలక సంస్థ పరిధిలో 154 చ.కిమీ మేరకు రీ సర్వే చేయనున్నామని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి కలిగిన ప్రతిఒక్కరికీ రీ సర్వే ఆధారిత శాశ్వత భూహక్కు పత్రాలను అందజేస్తామని, భవిష్యత్తులో ఆస్థి క్రయవిక్రయాలను సులభతరం చేసేందుకు ఆయా పత్రాలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. అక్టోబర్ నెల వరకు జరగనున్న సమగ్ర భూహక్కు రీ సర్వే కార్యక్రమానికి నగర ప్రజలంతా సహకరించేలా అధికారులు, కార్యదర్శులు అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సర్వేయర్లు, రీ సర్వే తహశీల్దార్, సచివాలయాల వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, డ్రోన్ ఏజెన్సీ నిర్వాహకులు కృష్ణ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.