నెల్లూరు: “వికసిత్ భారత సంకల్ప్ యాత్ర-ఫేస్ 2 ” కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం కోరారు.కేంద్ర ప్రభుత్వ పథకాలపై తేదీ 05-02-24 నుంచి 14 రోజులపాటు నగరంలో 28 ప్రాంతాల్లో ప్రచార వాహనం, శిబిరాల ద్వారా అవగాహనా క్యాంపులను నిర్వహిస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ సూచించారు. క్యాంపులలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, అవగాహన, అర్హులైన వారికి రిజిస్ట్రేషన్, ఆధార్ అప్డేట్, బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలు తదితర అంశాలను చేపడుతారని కమిషనర్ తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమ వ్యక్తిగత అనుభవాలను క్యాంపుల ద్వారా పంచుకుంటారని వెల్లడించారు.నగర పాలక సంస్థ గౌరవ మేయర్, డిప్యూటీ మేయర్లు, కో ఆప్షన్ మెంబర్లు, అందరు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు,అవగాహన కల్పించాలని కమిషనర్ తెలియచేశారు.అవగాహనా శిబిరాలలో కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.