AMARAVATHI

బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం వద్ద ఆక్రమ కట్టడాలను బుల్ డోజర్లతో కూల్చివేత

అమరావతి: మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం పరిసరాల్లోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు 5 బుల్డోజర్లు చేరుకున్నాయి..స్థానికుల నుంచి నిరసనలు చెలరేగే ఆవకాశలు వుండడంతో,భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి..ఇలాంటి దుర్ఘటలు భవిష్యత్ లో చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారు..సంఘటనా స్థలంలోనే మున్సిపల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్, ఇతర ఉన్నతాధికారులు కూల్చివేత ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు..మార్చి 31వ తేదిన శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో,,మెట్లబావిను కవర్‌ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలింది..  కూలిన శ్లాబ్ తో పాటు బావిలో పడి ఘటనలో ఇప్పటిదాకా 36 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.. 100సంవత్సరాల చరిత్ర ఉన్న బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం,,ఇండోర్‌ స్నేహ్‌నగర్‌లో పాత కాలనీల మద్య ప్రైవేట్‌ ట్రస్ట్‌ ఆధీనంలో నడుస్తోంది..మెట్ల బావి లోతు దాదాపు 40 అడుగుల వరకు వుంటుంది అధికారులు పేర్కొన్నారు..

ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్‌ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..ఇండోర్‌ మున్సిపల్‌ అధికారులు మాత్రం గత సంవత్సరం ఏప్రిల్‌లోనే అక్రమ కట్టడాలకు సంబంధించి,ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేశామని,,అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు.. ట్రస్ట్‌ సభ్యులు మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతు,,మతపరమైన విషయాల్లో ఇండోర్‌ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది..   

ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం,,గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారంతో పాటు చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది..ఈ ఘటనపై మెజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు..ఇదే సమయంలో PM NRF నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది..

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

5 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

5 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

8 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

8 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

8 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

9 hours ago

This website uses cookies.