అమరావతి: PMLA కేసులో ED ఛార్జిషీట్ లో ప్రియాంక గాంధీ పేరు చేర్చారు..కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారని ఈడీ తన చార్జ్ షీటులో పేర్కొంది..NRI వ్యాపారవేత్త సీసీ థంపీకి భూమిని విక్రయించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.. ఈ కేసుకు సంబంధించి ఇంతకుముందు ఛార్జ్ షీట్ లలో వాద్రా పేరును థంపీ సన్నిహితుడిగా ఈడీ పేర్కొన్నప్పటికీ, ప్రియాంక పేరు ప్రస్తావనకు రావడం ఇదే తొలిసారి..ఓ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ, మనీలాండరింగ్, విదేశీ మారక ద్రవ్యం, నల్లధనం చట్టాల ఉల్లంఘన, అధికారిక రహస్యాల చట్టంపై పలు ఏజెన్సీలు విచారిస్తున్నాయి..రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీని నిందితులుగా పేర్కొనకపోయినప్పటికి థంపి, వాద్రాల మధ్య సంబంధాన్ని,, వీరి మధ్య జరిగిన ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను కూడా ఈడీ అందజేసింది..థంపి,, వాద్రా నుంచి ల్యాండ్ క్రూయిజర్ కారును కొనుగోలు చేశారని, దీని కోసం అతని నాన్-రెసిడెంట్ ఎక్స్ టర్నల్ ఖాతా నుంచి చెక్కుల ద్వారా చెల్లింపులు చేశారని ఈడీ పేర్కొంది.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.