PMLA కేసులో ED ఛార్జిషీట్ లో ప్రియాంక వాద్రా పేరును చేర్చిన ఈడీ
అమరావతి: PMLA కేసులో ED ఛార్జిషీట్ లో ప్రియాంక గాంధీ పేరు చేర్చారు..కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారని ఈడీ తన చార్జ్ షీటులో పేర్కొంది..NRI వ్యాపారవేత్త సీసీ థంపీకి భూమిని విక్రయించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.. ఈ కేసుకు సంబంధించి ఇంతకుముందు ఛార్జ్ షీట్ లలో వాద్రా పేరును థంపీ సన్నిహితుడిగా ఈడీ పేర్కొన్నప్పటికీ, ప్రియాంక పేరు ప్రస్తావనకు రావడం ఇదే తొలిసారి..ఓ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ, మనీలాండరింగ్, విదేశీ మారక ద్రవ్యం, నల్లధనం చట్టాల ఉల్లంఘన, అధికారిక రహస్యాల చట్టంపై పలు ఏజెన్సీలు విచారిస్తున్నాయి..రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీని నిందితులుగా పేర్కొనకపోయినప్పటికి థంపి, వాద్రాల మధ్య సంబంధాన్ని,, వీరి మధ్య జరిగిన ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను కూడా ఈడీ అందజేసింది..థంపి,, వాద్రా నుంచి ల్యాండ్ క్రూయిజర్ కారును కొనుగోలు చేశారని, దీని కోసం అతని నాన్-రెసిడెంట్ ఎక్స్ టర్నల్ ఖాతా నుంచి చెక్కుల ద్వారా చెల్లింపులు చేశారని ఈడీ పేర్కొంది.