అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పథకాలు మంజూరు చేసిందని,,ఇందులో బాగంగానే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని కేంద్ర విద్యా మరియు స్కిల్ డెవెలెప్ మెంట్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు..శుక్రవారం విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్ర గిరిజన యూనివర్సిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేశారు.. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పాటుతో గిరిజనుల భవిష్యత్ అద్భుతంగా మారుతుందన్నారు.. రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు.. అంతర్జాతీయ స్థాయి కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు..రాష్ట్రాల్లో అధికారంలో ఇతర పార్టీలు వున్న,,కేంద్ర ప్రభుత్వ పరంగా తమకు అభివృద్ధే ముఖ్యమని,, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు..నూతన విద్యా విధానం మన భారతీయులకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు..ఈ సందర్భంగా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను గురించి ప్రస్తావిస్తూ,,ప్రాంతీయ భాషలో విద్యనభ్యసిస్తే ఏ రంగంలోనైనా సులభంగా అభివృద్ధి సాధించవచ్చున్నారు..ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్,,విద్యాశాఖ మంత్రి బొత్స.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.