అమరావతి: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదని,,స్వలింగ సంపర్కుల వివాహంపై చట్టం చేసే హక్కు పార్లమెంట్ కే ఉంటుందని సుప్రీం చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది..మంగళవారం సీజేఐ చంద్రచూడ్ తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహా బెంచ్ లో సభ్యులుగా ఉండగా,,జస్టిస్ హిమా కోహ్లీ మినహా మిగిలిన నలుగురు న్యాయమూర్తులు తీర్పును చదివారు..ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అభిప్రాయాన్ని మార్చుకోవాలని కోరింది..లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని అభిప్రాయపడింది..
కోర్టులు చట్టాలను రూపొందించవని,,ఉన్న చట్టాలనే అర్థం చేసుకుని అమలు చేస్తాయన్నారు..ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని చెప్పారు..ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది..వివాహేతర జంటలతో పాటు స్వలింగ జంటలు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు..పెళ్లి చేసుకున్న ఆడ-మగ జంట మాత్రమే పిల్లలకు రక్షణ కల్పిస్తారని అనుకోవడం అపోహ మాత్రమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది..
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.