INTERNATIONAL

అమెరికాలో 7 సంవత్సరాలకు పైబడి నివసిస్తున్నావారికి గ్రీన్ కార్డు

అమరావతి: అమెరికాలో నివసించే భారతీయులకు బైడెన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అమెరికాలో 7 సంవత్సరాలకు పైబడి నివసిస్తున్నావారికి H-1B వీసాపై ఐటీ సంస్థ‌లో ప‌ని చేస్తున్నవారు, గ్రీన్ కార్డ్‌ జారీ చేసేందుకు ఇమ్మిగ్రేష‌న్ యాక్ట్ ( US Immigration Act )లో స‌వ‌ర‌ణలు చేర్చారు. కొన్ని క్యాట‌గిరీల్లో ప‌ని చేస్తున్న భార‌తీయ టెక్ నిపుణుల‌కు ల‌బ్ధి చేకూర్చేలా నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ రూపొందించిన బిల్లును అమెరికా సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. సెనెట‌ర్ అలెక్స్ పాడిల్లా ప్ర‌తిపాదించ‌గా,ఇత‌ర సెనెట‌ర్లు ఎలిజ‌బెత్ వారెన్‌, బెన్‌రాయ్ లుజాన్‌, డిక్ దుర్బిన్ మ‌ద్ద‌తు ప‌లికారు. అమెరికా ప్ర‌జా ప్ర‌తినిధుల స‌భ‌లోనూ కాంగ్రెస్ ఉమ‌న్ జో లాఫ్‌గ్రెన్‌ ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. జో లాఫ్‌గ్రెన్ ఇమ్మిగ్రేష‌న్ హౌస్ స‌బ్ క‌మిటీ చైర్‌గా ఉన్నారు.ఈ బిల్లు చ‌ట్టంగా మారితే ప్ర‌స్తుతం H-1B వీసాపై ప‌ని చేస్తున్న వారితో స‌హా 80 ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి చేకూరుతుంది. ఇందులో H-1B వీసా దారులు, దీర్ఘ‌కాలం వీసాపై ప‌ని చేస్తున్న నిపుణుల పిల్లలు, గ్రీన్ కార్డు డ్రీమ‌ర్లు, త‌దిత‌రుల‌కు గ్రీన్ కార్డు ల‌భిస్తుంది.దేశాల వారీగా కోటా ప్ర‌కారం అమెరికా జారీ చేస్తున్న గ్రీన్ కార్డు కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న భార‌తీయ నిపుణులు అత్య‌ధికంగా ల‌బ్ధి పొందుతార‌ని భావిస్తున్నారు.ఒక అంచనా ప్రకారం అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారు,అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి సుమారు USD 83 బిలియన్లు,,పన్నుల రూపంలో సుమారు USD 27 బిలియన్లు చెల్లిస్తున్నారు. ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును సెనెట‌ర్ అలెక్స్ పాడిల్లా ప్ర‌తిపాదిస్తూ, అమెరికా ఎకాన‌మీకి వెన్నెముక‌గా ఉంటూ ఏళ్ల త‌ర‌బ‌డి గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న వారి ఆశ‌లు సాకారం చేసేలా మ‌న అప్‌డేటెడ్ ఇమ్మిగ్రేష‌న్ సిస్ట‌మ్ చ‌ర్య‌లు తీసుకుంటుంది. నేను ప్ర‌తిపాదించిన బిల్లుతో 35 ఏళ్లకు పైగా అమెరికాలో నివాసం ఉంటూ శాశ్వ‌త నివాసం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారందరికీ తొలిసారి ఇమిగ్రేష‌న్ రిజిస్ట్రీ,క‌టాఫ్ డేట్ అప్‌డేట్ చేస్తుంది. US Immigration స‌వ‌ర‌ణ బిల్లు చ‌ట్టంగా మార‌డానికి కొంత స‌మ‌యం ఉంది.తొలుత యూఎస్ సెనెట్‌, ప్ర‌జాప్ర‌తినిధుల స‌భ అంగీక‌రించి, ఆమోదించాలి. అటుపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆ బిల్లుపై సంత‌కం చేయ‌డంతో చ‌ట్టంగా మారుతుంది.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

3 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

6 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

7 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

1 day ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

1 day ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.