AMARAVATHI

బెంగుళూరులో వర్ష భీభత్సం-ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నవిజయవాడకు చెందిన మహిళ మృతి

అమరావతి: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు,,మెరుపులతో భారీ వర్షం కురిసింది.. 3 గంటలకు మొదలైన వడగళ్ల వాన సుమారు గంటసేపు భీభత్సవం సృష్టించింది..ఈదురు గాలుల ధాటికి చెట్లు కూలి పలుచోట్ల వాహనాలు థ్వసం అయ్యాయి..భారీ వర్షం కారణంగా వరద నీరు పోటెత్తడంతో కే.ఆర్ సర్కిల ప్రాంతంలోని అండర్ బ్రిడ్జిలో ఒక కారు చిక్కుకుని పోయింది..ఇంజిన్ లోకి నీరు వెళ్లడంతో కారు అగిపొయింది..పరిస్థితిని గమనించిన స్థానికులు వారిని బయటకు తీసినప్పటికి,,(23) మహిళ తీవ్ర ఆస్వస్థకు గురై మరణించింది..మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన భానురేఖ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు..కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చినట్లు సమాచారం.. వరద ముంచెత్తే సమయంలో కారులో భానురేఖతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు.. భారీ వర్షం కారణంగా బెంగళూరు నగరంలోని ఆనందరావు రోడ్,,మెజిస్టిక్,,రేస్ కోర్సు,, కె.ఆర్.సర్కిల్,,టౌన్ హాల్ సర్కిల్,,కార్పొరేషన్,,మైసూర్ బ్యాంక్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది..పలుచోట్ల రోడ్డు ప్రక్కన వాహనాలు పార్కింగ్ చేసి వుండగా, భారీ వర్షం ధాటికి వృక్షాలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి.. కుమార్ కృపా రోడ్డులోని చిత్రకళా పరిషత్ ఎదురుగా భారీ వృక్షం కూలిపోవడంతో కారు దెబ్బతిన్నది..అదే కారులో ప్రయాణిస్తున్న వారి కూడా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం..దుర్ఘటన గురించి తెలుసుకున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆస్పత్రికి చేరుకొని భానురేఖ కుటుంబాన్ని పరామర్శించి,, రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

7 mins ago

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

16 hours ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

16 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

21 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

2 days ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

2 days ago

This website uses cookies.