అమరావతి: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రారంభించిన కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణను తక్షణమే నిలిపేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది..ఇంత వరకు సేకరించిన సమాచారాన్ని భద్రంగా కాపాడాలని తెలిపింది..కుల ఆధారిత జనాభా లెక్కలను సేకరించేటపుడు వ్యక్తిగత గోప్యత హక్కును పట్టించుకోలేదని, బిహార్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది..ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను పరిశీలించినపుడు,, రాష్ట్రంలో సేకరించిన సమాచారాన్ని శాసన సభలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో పంచుకొనే ఉద్దేశం కనిపిస్తోందని వ్యాఖ్యనించింది.. తదుపరి విచారణ జూలైలో జరుగుతుందని తెలిపింది..ఈ సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్పై తుది తీర్పు వెలువడే వరకు ఈ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఆదేశించింది..
హైకోర్టు ఆదేశాలపై బీజేపీ స్పందిస్తూ, నితీశ్ కుమార్ ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాన్ని రూపొందించిందని ఆరోపించింది.. సర్వేకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనతో, నితీశ్ కుమార్ ప్రభుత్వం జనవరి 7 నుంచి కుల ఆధారిత సర్వేను ప్రారంభించింది..రెండు దశలలో ఈ సర్వేను నిర్వహించాలని నిర్ణయించి,, తొలి దశ జనవరి 7 నుంచి 21 వరకు జరిపింది..రెండవ దశ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమై మే 15తో పూర్తి చేయాలని భావించింది..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.