AMARAVATHI

హమాస్ ఉగ్రదాడి గురించి మోదీకి వివరించిన ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ

అమరావతి: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం చోటు చేసుకున్న నేపధ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహూతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో సంభాషించారు..ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మీద జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు నేతన్యూహుకు తెలిపారు..నెతన్యాహు ఫోన్ చేశారని,, కష్ట సమయాల్లో తాము ఉన్నామని ఇజ్రాయెల కు భరోసా ఇచ్చినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు..శనివారం నుంచి ఇజ్రాయెల్-హమాస్ తీవ్రవాదుల మధ్య తీవ్ర యుద్ధం ప్రారంభం అయిన తరువాత ఇరు దేశధినేతల మధ్య సంభాషణ జరగడం ఇదే తొలిసారి.. తన సోషల్ మీడియా ఎక్స్ లో ప్రధాని మోదీ పోస్ట్ చేస్తూ “నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు” అని తెలిపారు..ఈలాంటి క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్ కు అండగా నిలిచారని అన్నారు.. ఉగ్రవాదం ఏ రూపంలో వున్న భారతదేశం తీవ్రంగా ఖండిస్తోందని ఉద్ఘాటించారు.. ఇజ్రాయెల్ పై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ శనివారం జరిపిన రాకెట్ దాడిని,ఇజ్రాయోల్ పై జరిపిన ఉగ్రవాద దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు..ఇజ్రాయెల్ లో జరిగిన ఉగ్రవాద దాడి వార్తతో షాక్ కు గురైనట్లు పేర్కొన్నారు.. ఈ ఉగ్రదాడిలో మరణించినవారి ఇజ్రాయోల్ కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోదీ తన సానుభూతిని తెలియజేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

5 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

5 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.