AMARAVATHIINTERNATIONAL

హమాస్ ఉగ్రదాడి గురించి మోదీకి వివరించిన ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ

అమరావతి: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం చోటు చేసుకున్న నేపధ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహూతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో సంభాషించారు..ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మీద జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు నేతన్యూహుకు తెలిపారు..నెతన్యాహు ఫోన్ చేశారని,, కష్ట సమయాల్లో తాము ఉన్నామని ఇజ్రాయెల కు భరోసా ఇచ్చినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు..శనివారం నుంచి ఇజ్రాయెల్-హమాస్ తీవ్రవాదుల మధ్య తీవ్ర యుద్ధం ప్రారంభం అయిన తరువాత ఇరు దేశధినేతల మధ్య సంభాషణ జరగడం ఇదే తొలిసారి.. తన సోషల్ మీడియా ఎక్స్ లో ప్రధాని మోదీ పోస్ట్ చేస్తూ “నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు” అని తెలిపారు..ఈలాంటి క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్ కు అండగా నిలిచారని అన్నారు.. ఉగ్రవాదం ఏ రూపంలో వున్న భారతదేశం తీవ్రంగా ఖండిస్తోందని ఉద్ఘాటించారు.. ఇజ్రాయెల్ పై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ శనివారం జరిపిన రాకెట్ దాడిని,ఇజ్రాయోల్ పై జరిపిన ఉగ్రవాద దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు..ఇజ్రాయెల్ లో జరిగిన ఉగ్రవాద దాడి వార్తతో షాక్ కు గురైనట్లు పేర్కొన్నారు.. ఈ ఉగ్రదాడిలో మరణించినవారి ఇజ్రాయోల్ కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోదీ తన సానుభూతిని తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *