నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సర్వ సభ్య బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని ఎ.పి.జె అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు.. 2022-23 ఆర్ధిక సంవత్సరం యొక్క సవరించిన బడ్జెట్ అంచనాలు రూ.507,56,85,545/- లు,,అలాగే 2023-24 వార్షిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ.716, 49,03,000/- లకు కౌన్సిల్ ఆమోదించడం జరిగినది. నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని మేయర్ తెలిపారు. అనంతరం ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన వివిధ స్థానిక సమస్యలను, అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని మేయర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇంచార్జ్ కమిషనర్ చెన్నుడు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.