అమరావతి: బీజెపీ అభ్యర్దిగా మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ (32) కర్ణాటకలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మణతో మైసూర్-కొడగు లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష పోరుకు సై అంటూ లోకసభ ఎన్నికల బరిలో దిగారు..సోమవారం అయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఇల్లు, భూమి లేదా వాహనం కూడా లేవని పేర్కొన్నారు..నామినేషన్ పత్రాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ.4.99 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు.. అంతేకాకుండా తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలనూ అఫిడవిట్లో పేర్కొన్నారు..తన భార్య త్రిషిక కుమారీ వడియార్కు రూ.1.04కోట్లు, వారి సంతానం పేరిట రూ.3.64కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు.. తన తల్లి ప్రమోద దేవీ వడియార్, బీజేపీ స్థానిక ఎమ్మెల్యే శ్రీవత్సతో కలిసి మైసూరులోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లి రెండు సెట్లు నామినేషన్ పత్రాలు అధికారికి అందజేశారు..
2013లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ కన్నుమూసిన రెండేళ్లకు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ మైసూరు 27వ రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేశారు..2016లో దుంగార్పుర్ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.