అమరావతి: దీపావళిని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ప్రభుత్వం అయోధ్యలో నిర్వహిస్తున్న దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలుత రామ జన్మభూమిలోని రాంలాలా విరాజ్ మాన్ స్వామిని దర్శించుకున్నారు. రామజన్మభూమి ట్రస్టు సభ్యులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక హారతి ఇచ్చిన మోడీ,, ప్రతిష్టాత్మకమైన భగవాన్ శ్రీరాముని రాజ్యాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం సరయూ నదీ తీరంలో నిర్వహించిన హారతి కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. నదీ తీరంలో దాదాపు 18 లక్షల మట్టి ప్రమిదలను వాలంటీర్లు వెలిగించారు. బాణాసంచా, లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యోగి ప్రభుత్వం మెగా ‘దీపోత్సవ్’ వేడుకలను నిర్వహిస్తోంది. 2020లో సరయూ నది ఒడ్డున 5.84 లక్షల దీపాలు వెలిగించగా,, 2021లో 9 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగించడంతో అయోధ్య ప్రపంచ రికార్డు సృష్టించింది.నేడు 18 లక్షల దీపాలతో శ్రీరాముడి నడయాడిన నేలలో వెలుగులతో నిండిపొయింది.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.