అమరావతి: ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాల అభివృద్ది చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనేదే మా సంకల్పం,, అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధం అని టీడీపీ అధినేత చంద్రబాబు,,జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ లు అన్నారు..బుధవారం తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన తెలుగు జన విజయ కేతనం(జెండా) సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఒక బ్లఫ్ మాస్టర్,,పదేపదే అబద్ధాలు చెప్తుంటారు,, సొంత బాబాయిని ఎవరు చంపారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. వైసీపీ వై నాట్ 175 అంటున్నారని,,మేము వై నాట్ పులివెందుల అంటున్నమని అన్నారు..జగన్ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, అవమానించాడు,,ఇందులో సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి,, రాజమౌళిని అవమానించారన్నారు..టీడీపీ-జనసేన కూటమి సభతో తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతోందన్నారు..రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు..త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని,,భవిష్యత్కు నాంది పలకాల్సిన బాధ్యత మనమై ఉందన్నారు.. ఎన్నిలకు ముందు ముద్దులు పెట్టిన జగన్,, ఎన్నికల తర్వాత జర్నలిస్టులను కూడా వదల కుండా పిడిగుద్దులు కురిపిస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు..
పవన్ కళ్యాణ్ :- సీఎం జగన్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..జగన్, నేనూ తెలుగు మీడియంలోనే చదువుకున్నాను,, సంస్కారం ఉన్నందునే నీలా మాట్లాడలేకపోతున్నా,, ఓ సామాన్యుడు రాజకీయాలు చేస్తే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు..5 రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..శక్తి సామర్థ్యాలు చూసుకునే 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు ఒప్పుకున్నాం,, టీడీపీ-జనసేన సహకారంతోనే ప్రజలకు భవిష్యత్ ఉంటుందన్నారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పొత్తులు పెట్టుకున్నమని,, టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే ప్రజలకు భవిష్యత్ ఉంటుందని భరోస ఇచ్చారు.. ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు చేస్తోందని, వైసీపీ గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు.,,మా సభలు, నాయకులపై వైసీపీ గూండాలు దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు..నిన్ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం నేను…జగన్ కోటలు బద్ధలు కొడతాం… సిద్ధం సిద్ధం అంటున్నావ్.. కానీ నీకు నేను యుద్ధాన్ని ఇస్తున్నా అంటూ వ్యాఖ్యనించారు..రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనేదే మా ఉద్దేశమని,,25 కిలోల బియ్యం ఇచ్చేందుకు కాదన్నారు.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు..రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, వర్గాలను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.