AMARAVATHI

వారాహిపై జూన్ 14 నుంచి పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభం

అమరావతి: జనసేనాని పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర త్వరలో ప్రారంభం కానున్నట్లు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు..శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు..అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ  జూన్ 14 నుంచి వారాహిపై పవన్ కల్యాణ్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారని,, తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో  రత్నగిరిపై కొలువైన  సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని యాత్రను ప్రారంభించనున్నారని మనోహర్ తెలిపారు.. పవన్ వారాహి యాత్ర ఒకే విడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారన్నారు.. ఇందులో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు..ఈ యాత్ర ద్వారా పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు..మహిళలు, రైతులు, యువత సమస్యల్ని తెలుసుకుంటారని..ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకే వారాహి యాత్ర అని తెలిపారు..రాష్ట్ర క్షేమం కోసం పవన్ చేసే ఈ యాత్ర ఉపయోగపడుతుందని,,యాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని,, స్థానిక సమస్యల పరిష్కార మార్గాల కోసం కృషి చేయనున్నారని మనోహర్ తెలిపారు.

ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని,,పీఠాపురం,,కాకినాడ రూరల్,,కాకినాడ ఆర్బన్,,ఉమ్మడివరం,,ఆమలపురం,,బి.గన్నవరం,, రాజోలు,,నరసాపురం,,భీమవరం,,పాలకొల్లులో కొనసాగుతుందన్నారు..భీమవరం తరువాత స్థానిక నాయకులతో సంప్రదించి యాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకొవడం జరుగుతుందన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

4 hours ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

5 hours ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

9 hours ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

10 hours ago

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

1 day ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

1 day ago

This website uses cookies.