ఈ నెల 30న ”అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్” ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
అమరావతి: సామాన్య ప్రయాణికుడికి అందుబాటులో అధునతన సౌకర్యాలతో వేగంతో ప్రయాణించే ”అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్” ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వ తేదిన జెండా ఊపి ప్రారంభించనున్నారు..గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే ఈ పుష్-పుల్ రైలు ప్రధానం దిగువ,,మధ్యతరగతి ప్రయాణికులకు సేవలు అందించనున్నది.. అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో 22 కోచ్ లు ఉంటాయి..అన్ రిజర్వ్ డ్ పాసింజర్ల కోసం 8 జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు,, 12 సెకెండ్ క్లాస్(స్లీపర్),, 3-టైర్ స్పీపర్ కోచ్ లు,, రెండు గార్డు కంపార్ట్ మెంట్లు ఉంటాయి.. దివ్యాంగ ప్రయాణికులకు, మహిళలకు తగు సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు..అమృత్ భారత్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేస్తున్నారు..
ప్రధాని మోదీ డిసెంబర్ 30వ తేదిన రెండు ‘అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్’ రైళ్లను ప్రారంభిస్తారు..మొదటి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్…ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య మీదుగా బీహార్ లోని దర్బంగా వరకూ ప్రయాణిస్తుంది..రెండవ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ బెంగళూరు నుంచి మాల్డా రూట్ లో ఈ రైలు ప్రయాణించనున్నది.