అమరావతి: కర్ణాటక రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి..సోమవారం తెల్లవారుజాము నుంచే బెంగళూరు నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు నిండు కుండను తలపిస్తున్నాయి..భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..బెంగళూరు నగరంలోని బెళ్లందురు,,సర్జాపురా రోడ్,,వైట్ఫీల్డ్,,ఔటర్ రింగ్ రోడ్,,బి.ఇ.ఎం.ఎల్ లేఅవుట్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి..స్పైస్ గార్డెన్ నుంచి వైట్ఫీల్డ్ కు వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. వాహనాలు నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఏర్పాడింది..కర్ణాటకలో మరో 5 రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది..ఈ నెల 9వ తేది వరకూ ఉడుపి,,ఉత్తర కన్నడ,,దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని,,కోస్తా ప్రాంతంలో మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లవద్దని హెచ్చరించింది..బెంగళూరు నగరంలోనూ 9వ తేది వరకూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది..
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.