రెండు దశాబ్ధాల కల ఇది..
హైదరాబాద్: దర్శకుడు రామ్గోపాల్ వర్మ అంటేనే, వివాదాలు,కట్టె విరిచిపెట్టినట్లుగా వుండే ట్వీట్లు..అలాంటి వర్మదర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “లడ్కీ” మార్షల్ ఆర్ట్స్ ను కథాశంగా తీసుకుని రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో “అమ్మాయిగా”విడుదల చేయనున్నారు..ఈ చిత్రంను తమిళ, మలయాళ, కన్నడ భాషలతోపాటు చైనాలోనూ విడుదలకు సిద్దం చేస్తున్నారు.. చైనీస్లో “గర్ల్ డ్రాగన్” పేరుతో దాదాపు 40000 థియేటర్లలో విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు. దుబాయ్కు చెందిన నిర్మాణ సంస్థ ARTSEE MEDIA and Chinese company BIG PEOPLE సంస్థతో కలిసి రామ్గోపాల్వర్మ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 15వ తేదిన విడుదల కానుంది.. చైనాలో దంగల్ 9000,,సీక్రెట్ సూపర్స్టార్ 12000,,బాహుబలి 6000 చిత్రాలు థియేటర్లలో విడుదల కాగా, “లడ్కీ” చిత్రం మాత్రం 40000 థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి.. భారతదేశ చలన చిత్రరంగం చరిత్రలోనే ఈ స్థాయిలో చైనాలో విడుదల చేయడం తొలిసారి..ఈ చిత్రంలో కథానాయికీగా నటించిన “పూజా బాలేకర్ టైక్వాండో నేషనల్ ఛాంపియన్”..అయినప్పటికీ ఈ చిత్రంలో కథాశంకు అవసరం కావడంతో, చైనాలోని షావోలిన్ టెంపుల్లో శిక్షణ పొందిన నిపుణుల పర్యవేక్షణలో బ్రూస్లీ స్టైల్ అయినటువంటి “జీత్ కునేడో”లో శిక్షణ పొందింది..బ్రూస్లీ పట్ల నాకున్న అభిమానంతో తీసిన చిత్రమిది. రెండు దశాబ్ధాల కల ఇది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.