POLITICS

ఎన్నికల హామీలపై కాంగ్రెస్ పార్టీకి  కర్ణాటకలో కష్టాలు ప్రారంభం

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి  కర్ణాటకలో కష్టాలు ప్రారంభంమౌవుతున్నాయి..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు,ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు ప్రారంభానికి సిద్దమౌవుతున్నాయి..నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును వినియోగించేవారు జూన్ 1వ తేది నుంచి విద్యుత్తు బిల్లులను చెల్లించొద్దని బీజేపీ నేత, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ ప్రజలను కోరారు.. గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాను మైసూరు-కొడగు ప్రాంతంలో ధర్నా చేస్తానని చెప్పారు..ఒక కుటుంబం నెలకు 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్తును వాడుకుంటే, అందులో 200 యూనిట్లను ఉచితంగా పరిగణించాలని, మిగిలిన యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.. నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును ఉపయోగించేవారు జూన్ 1 నుంచి బిల్లులు చెల్లించవద్దని చెప్పారు..200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తు సిద్ధరామయ్యకు కూడా ఉచితమేనని ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు..

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే..224 స్థానాలున్న కర్ణాటక శాసన సభలో 135 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నది..పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని,,డీకే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు..ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలనూ త్వరలోనే అమలు చేస్తామని నూతన ప్రభుత్వం ప్రకటించింది.

Spread the love
venkat seelam

Recent Posts

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

16 hours ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

2 days ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

2 days ago

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

3 days ago

This website uses cookies.