అమరావతి: గుగూల్ మ్యాప్ ను గుడ్డిగా అనుసరించి కారును డ్రైవ్ చేయడంతో కేరళలోని పెరియార్ నదిలో కారు పడి పోవడంతో ఇద్దరు వైద్యులు మృతి చెందారు,, కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అద్వైత్, అజ్మల్ లు డాక్టర్లుగా పని చేస్తున్నారు..ఆదివారం రాత్రి ఒక బర్తేడే పార్టీకి హాజరైన అద్వైత్ (29), అజ్మల్ (29)లు మరో ముగ్గురు స్నేహితులతో కలసి అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో వారు కారులో కొడంగల్లూర్ కు తిరిగి వస్తున్నారు..భారీ వర్షం కారణంగా రోడ్డు స్పష్టంగా కన్పించక పోవడంతో,,డైరెక్షన్స్ కోసం గూగుల్ మ్యాప్స్ ను అనుసరించారు..గూగుల్ మ్యాప్స్,,,,సదరు రోడ్డును గొతురుత్ వద్ద నేరుగా నదిలోకి చూపించింది..అది గమనించని వీరు,,రోడ్డుపై నీరు పారుతూన్నట్లుగా భావించి,,దాటేందుకు ప్రయత్నించడంతో కారు పెరియార్ నదిలో పడిపోవడిపోయింది..ఇది గమనించిన స్థానికలు వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు ప్రయత్నించగా,,అప్పటికే ఇద్దరు యువ వైద్యులు మరణించారు..వెంటనే అగ్నిమాపక,,పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు..కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు గాయాలు కావడంతో,,చికిత్స కోసం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించమని,,చనిపోయిన ఇద్దరు వైద్యుల మృతదేహాలను వెలికితీసేందుకు స్కూబా డైవింగ్ బృందాన్ని రంగంలోకి దింపినట్లు వడక్కేకర పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.