AMARAVATHI

140 కోట్ల మందికి మోదీ కీ గ్యారంటీ రూపంలో హామీ ఇస్తున్నాం-ప్రధాని మోదీ

బీజేపీ మేనిఫెస్టో విడుదల..

అమరావతి: 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఉచిత రేషన్ అందజేస్తామని.. వృద్ధులనూ ఆయుష్మాన్ భారత్‌లో చేరుస్తామని,, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు..ఆదివారం ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు..ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ తమ పాలన సమయంలో పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని,, మరో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు.. రానున్న రోజుల్లో పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు..పీఎం సూర్యఘర్‌ పథకానికి కోటి మంది రిజిస్టర్‌ చేసుకున్నారని,, ఇంట్లో తయారైన కరెంట్‌ను ప్రజలు విద్యుత్ సంస్థలకు అమ్ముకోవడానికి కూడా వీలుంటుందన్నారు..ఇప్పటి వరకు ముద్ర పథకం కింద కోట్లమందికి స్వయం ఉపాధి లభించిందని,,ముద్ర పథకం రుణ పరిమితిని రూ.20 లక్షలు చేస్తామన్నారు..చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని,,దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడడం జరిగిందన్నారు.. వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగం పెంచడంతో పాటు మహిళలకు ఇప్పటికే డ్రోన వినియోగం శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.. శ్రీ వరి రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు ఉంటుందని అలాగే సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తామన్నారు..నానో యూరియా వినియోగం మరింత పెంచుతాం.’ అని ప్రధాని మోదీ అన్నారు..

దేశంలో మూడు రకాల వందే భారత్‌ రైళ్లు:- బీజేపీ పాలనలో అభివృద్ధి,, సంస్కృతి రెండింటికీ సమ ప్రాధాన్యం ఉందని,, ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్‌ను మారుస్తామన్నారు..దేశంలో మూడు రకాల వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని,, వందే భారత్‌ స్లీపర్‌,,వందే భారత్‌ మెట్రో రైళ్లు,,బుల్లెట్‌ రైళ్లు అని తెలిపారు..ముంబై-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు మార్గం పూర్తి కానుందని అలాగే ఉత్తర, దక్షిణ, తూర్పు వైపు కూడా బుల్లెట్‌ రైలు మార్గాలు వేస్తామని తెలిపారు..యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ తీసుకువస్తామని,,వన్ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తామన్నారు..యువశక్తి, నారీశక్తి, గరీబ్‌, కిసాన్‌ను దృష్టితోనే సంకల్ప్‌ పత్ర అన్నారు.. యువత ఆకాంక్షలను మా సంకల్ప్‌ పత్ర ప్రతిబింబిస్తోందని,, 140 కోట్ల మందికి మోదీ కీ గ్యారంటీ రూపంలో హామీ ఇస్తున్నాం.’ అని ప్రధాని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

20 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

21 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

22 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

23 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

1 day ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.