AMARAVATHI

జగనన్న సురక్ష పథకంతో అర్హులందరికీ సంక్షేమం- కమిషనర్ వికాస్

నెల్లూరు: ప్రజా సమస్యలకు సంతృప్తికర స్థాయిలో పరిష్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “జగనన్న సురక్ష” పథకంతో అర్హులందరికీ సంక్షేమం సాధ్యమని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. స్థానిక రూరల్ నియోజకవర్గం పరిధిలోని 2, 26 డివిజనులోని 7 సచివాలయాల కేంద్రాలు, నగర నియోజకవర్గం పరిధిలోని 15, 39, 40 డివిజనుల్లోని మొత్తం 8 సచివాలయాల్లో మంగళవారం ప్రారంభించిన జగనన్న సురక్ష పథకంలో భాగంగా కమిషనర్ పాల్గొని మంజూరు చేసిన టోకన్ల ఆధారంగా లబ్ధిదారులకు ధ్రువపత్రాలు మంజూరు చేశారు. అదేవిధంగా జగనన్న సురక్ష శిబిరాలు ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలలో ఆధార్ అప్డేట్ సెంటర్, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సేవలను అందించామని తెలిపారు. సచివాలయ సిబిరాలలో ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్, హెల్ప్ డెస్క్, రిజిస్ట్రేషన్ డెస్క్ ల ద్వారా అన్ని రకాల సేవలను అందిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా మొత్తం 11 సేవలను అందిస్తున్నామన్నారు.ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు), ఆదాయ,జనన మరణ, ఆస్థి పన్ను పేరు మార్పు చేర్పులు, వివాహ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్ డేట్, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు,చేర్పు లాంటి సేవలను అందించామని కమిషనర్ వివరించారు.ఈ కార్యక్రమాల్లో విజయా డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్థానిక డివిజనుల కార్పొరేటర్లు, వైసిపి నాయకులు, నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

13 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

15 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

15 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

20 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.