అమరావతి: గ్రీస్ లో గూడ్స్ రైలును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొన్న దుర్ఘటనలో దాదాపు 29మంది ప్రాణాలు కోల్పోగా,, మరో 85 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు..బుధవారం వేకువజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రమాద తీవ్రను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని గ్రీస్ అగ్నిమాపక అధికారి వాసిలిస్ వర్తకోయనిస్ తెలిపారు. మూడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయని,,పట్టాలు తప్పిన బోగీలు సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లినట్లు వెల్లడించారు..ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందండంతో,తన సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని,సహాయ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.. ఏథెన్స్ కు ఉత్తరన 235 మైళ్ల దూరంలో ఉన్న టెంపే అనే చిన్న పట్టణానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో దాదాపు 350 మంది ప్రయాణీకులు ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపటానికి చాలామంది ప్రయాణీకులు కిటికీల్లోంచి బయటకు దూకడంతో,, చాలామందికి గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు..గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు..సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.