అమరావతి: 5.500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని రాత్రిపూట ప్రయోగాత్మకంగా భారత్ విజయవంతంగా నిర్వహించిందని గురువారం రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద చైనా సైనికులు భారత సైనికులతో ఘర్షణకు దిగిన కొద్ది రోజుల తర్వాత ఈ పరీక్షలు జరిగాయి. రెండు వైపుల నుంచి అనేక మంది సైనికులు గాయపడ్డారే కానీ సైన్యంలో ఎవరూ మరణించలేదు. అగ్ని- 5 అనేది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) కింద అభివృద్ధి చేయబడింది..అధునాతన మిస్సైల్ ఉపరితలం నుంచి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ క్షిపణి, దిన్ని ఇంటర్సెప్టర్ మిస్సైల్ లేకుండా ఆపలేము.ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్, ICBM, అగ్ని-5ని DRDO దేశీయంగా అభివృద్ధి చేసింది. భారతదేశం కూడా అగ్ని-6పై పని చేస్తోంది, ఇది జలాంతర్గాముల నుంచి,భూమి నుండి ప్రయోగించగలదు. 8,000–10,000 కి.మీ.ల స్ట్రైక్-రేంజ్ కలిగి ఉంటుంది.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.