హైదరాబాద్: గణేష్ ఉత్సవ సమితి నాయకులు నిరసన దీక్షకు దిగడంతో,,బీజెపీ అధ్యక్షడు,ఎం.పీ బండి.సంజయ్ బుధవారం వినాయక్ సాగర్ (ట్యాంక్ బండ్) ప్రాంతాన్ని సందర్శించి,ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.పరిస్థితి తీవ్ర రూపందాల్చచడంతో,,తెలంగాణ ప్రభుత్వం దిఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు ప్రారంభించారు..బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్ లను ఏర్పాటు చేస్తున్నారు..అలాగే ఎన్టీఆర్ మార్గం మీద మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టతను ఇచ్చారు..అలాగే వినాయక నిమజ్జనం కోసం రాచకొండ పరిధిలోని సరూర్ నగర్, నల్ల చెరువుకట్ట ఉప్పల్, సఫిల్ గూడ లాంటి ఇతర ట్యాంక్ లపైనా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇప్పటికే అవసరమైనన్ని క్రేన్లు అందుబాటులో ఉంచారు. కేవలం మట్టి గణేష్ విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే అన్ని రకాల వినాయకుల నిమజ్జనానికి అనుమతినివ్వాల్సిందేనని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ డిమాండ్ చేస్తోంది.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.