అమరావతి: కరోనా-19 కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెరుగుతున్న నేపధ్యంలో,తాజా పరిస్థితిపై – ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ తదితరులు పాల్గొన్న వర్చువల్ సమావేశంలో కొవిడ్-19పై ప్రధాని సమీక్ష జరిపారు. ముఖ్యంగా వైద్య శాఖాధికారులతో ప్రస్తుత పరిస్థితిని, సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఎన్నికేసులున్నాయి,, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అడిగి తెలుసుకున్నారు. జనసమర్థ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రధాని సూచించారు..ఎయిర్పోర్టుల వద్ద అప్రమత్తత పెంచాలని అలాగే వృద్ధులు, వయసులో పెద్దవారు ప్రికాషనరీ డోస్ తీసుకునేలా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ తో పాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్యను పెంచాలని చెప్పారు. కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే మందులు, తగినంత సంఖ్యలో వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్తో పాటు టెస్టులపై శ్రద్ధ పెంచాలని ప్రధాని అధికారులకు సూచించారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.