నెల్లూరు: జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్,, నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ల ఆదేశాల మేరకు చికెన్ షాపులను స్వచ్ఛందంగా మూసివేయాలని, ప్రజలంతా చికెన్ ఆధారిత ఆహార పదార్థాలను తినవద్దని కార్పొరేషన్ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.వెంకట రమణ కోరారు.. అధికారులతో కలిసి చిన్న బజారు సమీపంలోని చికెన్ మార్కెట్ ను ఆయన శనివారం తనిఖీ చేశారు.. నిల్వ ఉన్న చికెన్ ను స్వాధీనం చేసుకుని, షాపులను మూయించారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎవరూ చికెన్ విక్రయాలు, కొనుగోలు జరపరాదని డాక్టర్ హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్ లు, బార్లు, కర్రీస్ పాయింట్లలో చికెన్ విక్రయాలు జరపడాన్ని నిషేదించామని తెలిపారు. ప్రత్యమ్నాయంగా చేపలు, మటన్, రొయ్యలు వంటి మాంసపు ఉత్పత్తులను ఆహారంగా వినియోగించుకోవాలని సూచించారు.పై ఆదేశాలను ఉల్లఘించే షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఆరోగ్య శాఖ సూపర్ వైజర్లు, శేషయ్య, సురేంద్రనాథ్, ఇన్స్పెక్టర్ లు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.