నెల్లూరు నగరంలో చికెన్ నిషేధం-బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తొంది-కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్
నెల్లూరు: జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్,, నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ల ఆదేశాల మేరకు చికెన్ షాపులను స్వచ్ఛందంగా మూసివేయాలని, ప్రజలంతా చికెన్ ఆధారిత ఆహార పదార్థాలను తినవద్దని కార్పొరేషన్ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.వెంకట రమణ కోరారు.. అధికారులతో కలిసి చిన్న బజారు సమీపంలోని చికెన్ మార్కెట్ ను ఆయన శనివారం తనిఖీ చేశారు.. నిల్వ ఉన్న చికెన్ ను స్వాధీనం చేసుకుని, షాపులను మూయించారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎవరూ చికెన్ విక్రయాలు, కొనుగోలు జరపరాదని డాక్టర్ హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్ లు, బార్లు, కర్రీస్ పాయింట్లలో చికెన్ విక్రయాలు జరపడాన్ని నిషేదించామని తెలిపారు. ప్రత్యమ్నాయంగా చేపలు, మటన్, రొయ్యలు వంటి మాంసపు ఉత్పత్తులను ఆహారంగా వినియోగించుకోవాలని సూచించారు.పై ఆదేశాలను ఉల్లఘించే షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఆరోగ్య శాఖ సూపర్ వైజర్లు, శేషయ్య, సురేంద్రనాథ్, ఇన్స్పెక్టర్ లు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.