అమరావతి: టిబెట్లోని బాంగ్డా,,లాసా,, షిగాత్సే ప్రాంతాల్లో ఉన్న తన వైమానిక స్థావరాలను అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలతో నింపుతోంది..ఈ ప్రాంతాలు భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న వైమానిక స్థావరాలు.. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబరు 9వ తేదిన భారత బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్ లో, చైనా దూకుడు పెంచింది..ఈ వైమానిక స్థావరాలలో పెద్ద సంఖ్యలో ‘WZ-7 సోరింగ్ డ్రాగన్’ రకం డ్రోన్లు,, ‘సుఖోయ్ SU 27’ రకం యుద్ధ విమానాలను చైనా మోహరించిందని నిర్ధారించే పలు శాటిలైట్ దృశ్యాలతో తాజాగా కథనాలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి..ఈ ఉపగ్రహ చిత్రాలు డిసెంబరు 14వ తేది నాటివని పేర్కొన్నాయి..ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ లోని భారత గగన తలంలో చైనా విమానాలు చక్కర్లు కొడుతూ రెండుసార్లు భారత సైన్యం కంటపడ్డాయి..ఈ సమయంలో టిబెట్ లోని ఎయిర్ బేస్ లలో చైనా ఆయుధ సంపత్తి మోహరించిందనే వార్తలు బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది..డ్రోన్లు,,యుద్ధ విమానాలతో నిండుగా ఉన్న టిబెట్ లోని బాంగ్డా,, షిగాత్సే ఎయిర్ బేస్ భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది..టిబెట్ లోని లాసా ఎయిర్ బేస్ నుంచి భారత్ సరిహద్దులు 260 కిలోమీటర్ల దూరంలో ఉంది.. లాసాలో ఉన్న ఎయిర్ బేస్ విస్తరణ పనులను చైనా ప్రారంభించినట్లు శాటిలైట్ ఫొటోల్లో స్పష్టం కన్పిస్తొంది..అక్కడ రెండో విమాన రన్ వేను చైనా నిర్మిస్తున్నట్లు సమాచారం..బాంగ్డా,,లాసా,, షిగాత్సే వైమానిక స్థావరాలలో చైనా సిద్ధంగా ఉంచిన డ్రోన్ల జాబితాలో ‘WZ-7 సోరింగ్ డ్రాగన్’ అనే అత్యాధునిక డ్రోన్లు ఉన్నట్లు ఫోటోల్లో వెల్లడైంది..నిర్విరామంగా గగనతలంలో 10 గంటల పాటు పహారా కాస్తూ ఎగరగల సామర్థ్యం ‘WZ-7 సోరింగ్ డ్రాగన్’ కు ఉంది..ఈ డ్రోన్ నిర్దేశిత ప్రదేశాల గగన తలంలో తిరుగుతూ అక్కడి మ్యాపింగ్,, ఇమేజెస్ ను సైనిక స్థావరానికి చేరవేస్తుంది..ఇది పంపించే మ్యాపింగ్, ఇమేజెస్ ఆధారంగా,, లక్ష్యం ఎంత దూరంలో ఉందనే దానిపై ఒక స్పష్టతతో సైన్యం క్షిపణులను ప్రయోగిస్తుంది.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.