CRIME

బౌద్ధ సన్యాసిని వేషంలో ఢిల్లీలో పట్టుబడిన చైనాకు చెందిన మహిళ

అమరావతి: చైనాకు చెందిన ఓ మహిళ పేరు మార్చుకుని నకిలి గుర్తింపు కార్డులతో బౌద్ధ సన్యాసిని వేషంలో తిరుగుతుండగా ఈమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లీష్, నేపాలి, చైనీస్ భాషల్లో ఆనర్గళంగా మాట్లాడే ఈమె, చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన ‘కై రువో’ అనే మహిళగా తేలింది.సదరు మహిళ బౌద్ధ సన్యాసిని ముసుగులో’డాల్మా లామా’గా పేరు మార్చుకుని ఢిల్లీలో నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ యూనివర్సీటీ నార్త్ గేట్ వైపు వున్న టిటెటన్ శరణార్ధుల కాలనీ అయిన మజ్నుకా తిలాలో బౌద్ధ సన్యాసిని వేషధారణలో ఉన్న ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈమె నుంచి డోల్మా లామా పేరుతో వున్న నేపాల్ పౌరసత్వ దృవీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫారిన్స్ రీజినల్ రిజస్ట్రేషన్ కార్యాలయంలో ఆమె గురించి విచారించడంతో సదరు మహిళ చైనా పౌరురాలిగా నిర్ధారణ అయ్యింది. చైనా చెందిన ఆమె నేపాల్ పౌరసత్వ దృవీకరణ పత్రాలతో 2019 నుంచి భారత్ లోనే ఉండడంతో,ఆమె చైనా గూఢాచారి అనే పలు అనుమానాలు రేకెత్తున్న క్రమంలో ఆమెను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమెపై ఐపీసీ 120బి(నేర పూరిత కుట్ర)419 (వ్యక్తిగతంగా మోసం చేయటం)420 (చీటింగ్),467 సెక్యూరిటీ ఫోర్జరీ చేయటం) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె గుర్తింపు కార్డులో నేపాల్ రాజధాని ఖట్మండు అడ్రస్ ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను విచారిస్తున్న సమయంలో తనను చైనా కమ్యూనిస్టు పార్టీలోని కొంతమంది నేతలు చంపాలని చూస్తున్నారని,అందుకే ఇలా ఇక్కడ తలదాచుకున్నానని చెబుతోందని, అయితే అమె చెప్పే కారణాలు నమ్మదగినట్లుగా లేవని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

4 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

This website uses cookies.