DISTRICTS

కాలువల్లో పూడిక తీత పనులు వేగంగా పూర్తి చేయాలి-కమిషనర్ జాహ్నవి

నెల్లూరు: నగర వ్యాప్తంగా అన్ని డివిజనుల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ పనులు జరిగేలా అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలని కమిషనర్ జాహ్నవి ఆదేశించారు. స్థానిక 18 వ డివిజను హరనాథపురం పరిసర ప్రాంతాల్లోని డ్రైను కాలువల్లో పూడికతీత పనులను కమిషనర్ శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలపు పరిస్థితుల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరకుండా డ్రైను కాలువల ద్వారా సాఫీగా ప్రవాహం కొనసాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని డివిజనుల్లో డ్రైను కాలువల పూడికతీత పనులు జరుగుతున్నాయని, ప్రజలు అవగాహన పెంచుకుని కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు వంటి, ఏలాంటి వ్యర్ధాలు పారవేయొద్దని కమిషనర్ సూచించారు. స్థానిక పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్, సచివాలయ సానిటరీ సెక్రటరీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. డివిజనులో పారిశుద్ధ్య నిర్వహణ లోపించి, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, పారిశుద్ధ్య విభాగం అధికారులు, సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

7 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

1 day ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

2 days ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

2 days ago

This website uses cookies.