అమరావతి: జ్ఞాన వాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలంటూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసిలోని జిల్లా కోర్టు కొట్టివేసింది.శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించడానికి నిరాకరించింది.శుక్రవారం ఈ కేసుపై విచారణ కొనసాగించిన కోర్టు, కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరిశీలన ద్వారా శివలింగం నమూనాలు బయటపడతాయన్న హిందూ సంఘాల వాదనతో విభేదించింది. కార్బన్ డేటింగ్ అంశంపై జ్ఞాన వాపి మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతెజామియా కమిటీ తరఫున న్యాయవాది ముంతాజ్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ,,శివలింగానికి కార్బన్ డేటింగ్ చేసే క్రమంలో ఒకవేళ దానికి ఏదైనా స్వల్ప భౌతిక నష్టం వాటిల్లినా అది సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందికే వస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది ప్రస్తావించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జడ్జి ఎ.కె.విశ్వేష,,హిందూ సంఘాల పిటిషన్ ను తిరస్కరించారు.‘‘శివలింగం ఎంతకాలం కిందటిది ? అది ఏ రకానికి చెందినది ? అనే అంశాలను గుర్తించాలంటూ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించడం సమంజసంగా ఉండదు’’ అని జడ్జి వ్యాఖ్యానించారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.