NATIONAL

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.శుక్రవారం అయన మీడియా సమావేశంలో మట్లాడారు..ఎన్నికలకు నోటిఫికేషన్ అక్టోబరు 17వ తేదిన విడుదల అవుతుంది..17వ తేది నుంచి 25వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29వ తేది వరకు సమయం ఉంటుంది.68 స్థానాలకు నవంబర్ 12వ తేదిన పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8వ తేదిన కౌంటింగ్ జరగనుంది..ఓటర్లను ఏ రకంగానూ ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినా కఠిన చర్యలకు ఉపేక్షించబోమని, చట్ట విరుద్ధ చర్యలను కొనసాగనివ్వకుండా నిఘా పెడతామని సీఈసీ స్పష్టం చేశారు.68 అసెంబ్లీ స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో పాలన చేపట్టాలంటే 35 స్థానాలు సాధించాల్సి వుంటుంది. హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే 2023 జనవరితో పూర్తికానుంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ వివరణ ఇస్తు,,హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతంలో ఎక్కువగా మంచు వుంటుందని,అందువల్లే గతంలో పాటించిన విధానలను అనుసరిస్తూ,ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

15 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

15 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.