నెల్లూరు: తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కోటి రూపాయల విలువైన స్థలాన్ని ఉచితంగా అందజేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనమని,ఇదే స్ఫూర్తితో భవన నిర్మాణానికి కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వెంకటాచలం సమీపంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ అధ్యయన కేంద్రాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సాధిస్తే, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక కృషితో వెంకటాచలంలో నెలకొల్పడం జరిగిందన్నారు..ఈ కేంద్రానికి సొంత స్థలంలో భవన నిర్మాణాల విషయమై భారత ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సొంత భవనాలు కూడా నిర్మించి తెలుగు భాష ప్రాశస్త్యం, ప్రాభవం భవిష్యత్ తరాలకు తెలిసేలా ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని, తద్వారా తెలుగు భాష పూర్వ వైభవానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు..
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
This website uses cookies.