CRIME

మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని కారుతో ఢికొట్టి హత్య

అమరావతి: కర్ణాటకలో రాష్ట్రంలోని మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆర్‌కే కులకర్ణ( 82) ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి శుక్రవారం సాయంత్రం మైసూరు విశ్వవిద్యాలయంలోని మానసగంగోత్రి క్యాంపస్‌లో ఈవినింగ్‌ వాక్‌ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన మరణించారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు, కులకర్ణి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా,జరిగిన సంఘటన ప్రమాదం వశాత్తు జరిగింది కాదని, ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆయనను కారుతో ఢీకొట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 30 సంవత్సరాలు ఐబీలో పనిచేసిన కులకర్ణి 23 సంవత్సరాల కిందట పదవీ విరమణ చేసినట్లు మైసూరు పోలీసు కమీషనర్ చంద్రగుప్త తెలిపారు. కులకర్ణి రోజూ సాయంత్రం వేళ నడిచే దారిలో కార్లు వంటి వాహనాలు వెళ్లవని,దీంతో ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆయనను కారుతో ఢీకొట్టి హత్య చేశారని వెల్లడించారు.ఘటనకు కారణమైన కారుకు నంబర్‌ ప్లేట్లు లేవని, అయితే తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీస్ అధికారి వెల్లడించారు.లోతుగా దర్యాప్తు చేసేందుకు స్పెషల్ పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

13 mins ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

4 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

4 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

4 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.