లూజ్గా లేదా బహిరంగ విక్రయాలపై GST వర్తించదు..
అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ GSTపై ట్వీట్టర్ లో మంగళవారం కీలక ప్రకటన చేస్తూ,,ప్యాకేజీ ఫుడ్స్,, ఆసుపత్రి బెడ్స్ పై 5% GST విధించడంపై గందరగోళం నెలకొనడంతో,GST వర్తించని కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు. ప్రీప్యాకింగ్ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే GST వర్తిస్తుందని స్పష్టం చేశారు.ముఖ్యంగా ఓట్స్,, మొక్కజొన్న,,బియ్యం,, పప్పు,, బియ్యం,,రవ్వలు,,సెనగపిండి,,పెరుగు,,లస్సీ,,మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్గా,,ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు..ఇవే ఉత్పత్తులను విడిగా,, ప్యాక్ చేయకుండా విక్రయిస్తే GST వర్తించదని ఆర్థికమంత్రి పేర్కొన్నారు..లూజ్గా లేదా బహిరంగ విక్రయాలపై GST వర్తించదు అంటూ 14 వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ట్వీట్ చేశారు. లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై GST ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.. గత నెలలో GST కౌన్సిల్ 47వ సమావేశం ఏకగ్రీవ నిర్ణయం ప్రకారం చర్య తీసుకున్నామంటూ పన్ను పెంపును సమర్ధించుకున్నారు..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.