అమరావతి: గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గాలను త్వరలో ఎస్టీ జాబితాలో చేర్చుతామని,, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం జమ్ముకశ్మీర్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరీలో నిర్వహించిన భారీ ర్యాలీని అమిత్ షా ప్రారంభించారు.బహిరంగ సభలో అయన మాట్లాడుతూ పహారీలకు ఎస్టీ హోదాను మంజూరు చేస్తే దేశంలో భాషా పరంగా రిజర్వేషన్లు లభించిన మొదటి వర్గంగా నిలుస్తుందని అయితే ఇది జరిగాలంటే కేంద్రం పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలన్నారు. జస్టిస్ శర్మన్ కమిషన్,,, గుజ్జర్లు, బకర్వాల్, పహారీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని అవి త్వరలోనే అమలవుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తరువాతే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతాయని చెప్పారు. ఆర్టికల్ 370, 35ఏ లను తొలగించకుంటే గిరిజనులు రిజర్వేషన్లు పొందడం సాధ్యమయ్యేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు వాటిని తొలగించడంతో గిరిజనులు వారి హక్కులు పొందుతారని వెల్లడించారు. 70 సంవత్సరాలుగా కశ్మీర్ ను మూడు కుటుంబాలే పాలించాయని, ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కశ్మీర్ లో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పెంచామని, 100కు పైగా కొత్త స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హైవేల కోసం లక్ష కోట్లు మంజూరు చేశామంటే ఇవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాతే సాధ్యమైయ్యాయని అన్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.