అమరావతి: నైరుతి రుతుపవనాల జూన్ 24వ తేదీన ఉత్తరాది రాష్ట్రాలోకి ప్రవేశించి అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి..హిమాచల్ ప్రదేశ్ లో గత 48 గంటలుగా విడవకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బియాస్ నది నీటిమట్టం పెరిగింది..భారీ వర్షాల కారణంగా జరిగిన ప్రమాదల్లో 12 మంది మరణించగా,, సిమ్లా సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు జారిపడడంతో మట్టి క్రింద కూరుకుని పోయి 9 మంది మృతి చెందారు..దింతో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 21 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి సుఖవీందర్ సింగ్ సుక్కు వెల్లడించారు..“క్లౌడ్ బరస్ట్” వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూసుకుపోయాయి.. పలు రహదారులతో పాటు కీలకమైన సిమ్లా-చండీగఢ్ రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి..వాతావరణ శాఖ,, ఆగస్టు 14 నుంచి 17 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది..SDRF, NDRF,ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది..అయితే వర్షం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని,,వీలైనంత వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే వుండాని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ కోరారు.
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.