NATIONAL

చైనా చొరబాట్లుకు ప్రధాన కారణం ”హిమాలయన్ గోల్డ్“

అమరావతి: భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ లోకి చీటికి మాటికి చైనా చొరబడేందుకు ఎందుకు ప్రయత్నిస్తొంది ? రాజ్య విస్తారణ కాంక్షనే కారణమా ? కాదు ? ప్రధాన కారణం.. “హిమాలయన్ వయాగ్రాగా” పిలిచే  ‘హిమాలయన్ గోల్డ్’ అని ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ (IPCSP) విడుదల చేసిన ఒక నివేదికలో ఆశ్చర్యపరిచే అంశాన్ని ప్రస్తావించారు..పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్ ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్  అని పిలుస్తారు..దీనికి ప్రపంచ మార్కట్ తో పాటు చైనాలో బంగారం కంటే ఎక్కువ రేటు ఉందని IPCSP నివేదికలో ప్రస్తావించారు..సంస్థ కథనం ప్రకారం….”హిమాలయన్ గోల్డ్“ దాని పేరుకు తగ్గట్టుగానే ఇది భారత్ పరిధిలోని హిమాలయాలలో మాత్రమే లభిస్తుంది..అలాగే చైనా పరిధిలోని నైరుతి ప్రాంతంలో ఉండే క్వింఘాయ్,, టిబెటన్ పీఠభూమిలోని ఎత్తైన ప్రదేశాల్లో కూడా హిమాలయన్ గోల్డ్ దొరుకుతుంది..10 గ్రాముల హిమాలయన్ గోల్డ్ ధర రూ.56వేల దాకా ఉంటుందని అంచనా..అదే మేలు రకం హిమాలయన్ గోల్డ్ కిలో ధర లక్షల్లోనే ఉంటుందని నివేదిక అంచనా వేసింది..ప్రపంచంలోనే అత్యధికంగా హిమాలయన్ గోల్డ్ ను ఉత్పత్తి చేసే,,ఎగుమతి చేసే దేశం చైనాదేశమే..కొన్ని సంవత్సరాల నుంచి చైనాలోని క్వింఘాయ్ ప్రాంతంలో హిమాలయన్ గోల్డ్ సాగు దారుణంగా పడిపోతు వస్తొంది..2011 సంవత్సరంలో చైనా పరిధిలో అత్యధికంగా 1.50 లక్షల కేజీల హిమాలయన్ గోల్డ్ ఉత్పత్తి జరిగింది..2017 వచ్చే సరికి చైనాలో 43,500 కేజీల హిమాలయన్ గోల్డ్ మాత్రమే ఉత్పత్తి జరగగా,, 2018లో ఇది కాస్తా 41,200 కేజీలకు తగ్గింది..దీంతో హిమాలయన్ గోల్డ్ సాగుకు అనువైన భూమిని దక్కించుకునే క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని హిమాలయన్ ప్రాంతాలపై చైనా కన్నేసిందని నివేదికలో పేర్కొంది.ఈక్రమంలోనే ఇటీవల కాలంలో అరుణాచల్ సరిహద్దుల్లో  డ్రాగన్ సైన్యం కవ్వింపు చర్యలు మితిమీరాయని వెల్లడించింది..ఇక్కడ గమనించాల్సి మరో కీలకమైన విషయం,,హిమాలయ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రధాన ఆదాయం, 80 శాతం హిమాలయన్ గోల్డ్ సేకరణ నుంచే వస్తుంటుంది..

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

18 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

18 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

19 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

19 hours ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

2 days ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

2 days ago

This website uses cookies.