12 వేల మంది పింఛనుదారులు…
నెల్లూరు: అర్హులైన ఏ ఒక్కరు పింఛన్ రాకుండా మిగిలిపోరాదని, వారి అభ్యర్థనలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి 5వ తేదీలోగా నివేదికలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతినెల మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 80 కోట్ల రూపాయల మేరకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దాదాపు 12 వేల మంది పింఛనుదారులను అనర్హులుగా గుర్తించడం జరిగిందని, వారందరికీ తప్పనిసరిగా నోటీసులు వెంటనే జారీ చేయాలన్నారు.వారి నుండి అభ్యర్థనలను సరైన ఆధారాలతో స్వీకరించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాటిని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి నెల 5వ తేదీలోగా సంబంధిత నివేదికలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.వారి అభ్యర్థనలను సచివాలయ సిబ్బందితో సహా ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిశీలించాలని సూచించారు.ఈ విషయమై ప్రతిరోజు మండల ప్రత్యేక అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో పర్యవేక్షించి రోజువారి నివేదికలు అందజేయాలన్నారు.అర్హులైన ఏ ఒక్క పింఛనుదారు కూడా పింఛన్ రాకుండా తప్పిపోరాదని, అనర్హులు ఏ ఒక్కరు కూడా పింఛను పొందరాదని స్పష్టం చేశారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.