చిరు భద్రత..
హైదరాబాద్: రక్తదానం చేయడం చిన్న విషయం కాదని,బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మందికి సేవ చేస్తున్న సినీనటుడు చిరంజీవికి తెలంగాణ గవర్నర్ తమిళి సై అభినందనలు తెలిపారు..అదివారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు, రక్తదానం చేసిన దాతలను, 50 సార్లు,, అంతకంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారిని సన్మానించి,రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.అంతే కాకుండా వారికి చిరు భద్రత పేరుతో ఇన్స్యూరెన్స్ పత్రాలు కూడా అందించారు..రాజ్ భవన్ తరపున రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని,, అవసరమైన వారికి సయమానికి రక్తం అందించేందుకు, ప్రత్యేకంగా ఓ యాప్ కూడా రూపొందించామన్నారు.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందులోని భాగం కావాలని గవర్నర్ తమిళి సై కోరారు..ఈ సందర్బంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ 1998లో రక్తం అందుబాటులో లేక చాలా మంది మరణించారని,ఆ ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు.తన కోసం ఏం చేయడానికైనా అభిమానులు ఉన్నారని,, వారి ప్రేమను నలుగురికి ఉపయోగపడేలా మార్చాలనే ఉద్ధేశ్యంతో చిరంజీవి బ్లడ్ బ్యాక్ ప్రారంభించామని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా 2 నుంచి 3 వేల మంది రక్తదానం చేస్తున్నారన్నారు..అలాంటి వారికి భద్రత ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో చిరు భద్రత పేరుతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.