నెల్లూరు: జిల్లాలోని కండలేరు జలాశయ ముంపు బాధితులకు సంబంధించి ఉద్యోగాల కల్పన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కండలేరు జలాశయ ముంపు బాధితుల ఉద్యోగాలకు సంబంధించి చేపట్టిన కార్యాచరణ, పునరావాస వివరాలను కలెక్టర్ కు కమిటీ సభ్యులు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హరినారాయణ రెడ్డి, కలెక్టరేట్ ఏవో షఫీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.