అమరావతి: గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పంజాబ్ పర్యటన సందర్బంగా తలైత్తి లోపాలను దృష్టిలో వుంచుకుని,, అధికారులు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదే సమయంలోనే భారత్-పాక్ సరిహద్దుల వద్ద చేపట్టిన సోదాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), పంజాబ్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం మంగళవారం అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.ఈ ఆయుధాలు పాకిస్థాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది వేకువజామున, సీమా బాల్ సిబ్బంది ఫిరోజ్పూర్ సెక్టార్ నుంచి 6 మ్యాగజైన్లతో కూడిన మూడు AK సిరీస్ రైఫిల్స్, 4 మ్యాగజైన్లతో కూడిన రెండు M3 సబ్-మెషిన్ గన్లు,రెండు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు.డ్రోన్ల ద్వారా ఆయుదాలు జారా విడిచారా అన్న దిశలో కూడా విచారణ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 24వ తేదిన పంజాబ్ లోని మొహాలి,ముల్లన్పూర్లో హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించనున్నారు. మొహాలీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హెచ్ఎస్ మాన్ మాట్లాడుతూ, ‘ఆగస్టు 24న ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, భద్రతా ఏర్పాట్లలో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని’ తెలిపారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.