నెల్లూరు: నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు రెండు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు…నెల్లూరుజిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు,కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. బుధ,గురువారల్లో జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అవకాశం ఉందన్నారు. రాష్ట్రమంతా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని,విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో గంటకు 15 కి.మీ వేగంతో చల్లటి గాలులు వీస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
This website uses cookies.