అమరావతి: సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది..ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది..ఇందులో బాగంగా దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రసారాలను పెంచడానికి సెంట్రల్ స్కీమ్కు ఆమోదం తెలిపింది.. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆల్ ఇండియా రేడియో FM ఛానెల్ల కవరేజీని 80 శాతానికి పైగా జనాభాకు విస్తరించాలని, 8 లక్షల DD ఉచిత DISH DTHలను పంపిణీ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సెట్-టాప్ బాక్స్ లు అందించాలని నిర్ణయం తీసుకుంది..గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు,, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు రూ.2,539 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగిన మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించింది..దాదాపు 7 లక్షల మంది ఇళ్లలో ఉచితంగా డిష్ టీవీలను అందించాలని ప్రణాళికలు సిద్దంచేసింది.. దూరదర్శన్ ప్రస్తుతం 28 ప్రాంతీయ వాటితో సహా 36 టీవీ ఛానెల్లను నిర్వహిస్తోంది..DD ఉచిత DISH DTHలను విస్తరించడం వల్ల DTH బాక్సుల తయారీలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తొంది..
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.