నెల్లూరు: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపకరిస్తాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు..శుక్రవారం స్థానిక ఎ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆద్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్–హర్ ఘర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను మంత్రి జడ్పి ఛైర్ పర్సన్ శ్రీమతి ఆనం.అరుణమ్మ, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర మేయర్ స్రవంతి, నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ లతో కలసి ప్రారంభించారు. కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1వ తేది నుండి 15 రోజుల పాటు ప్రతి రోజు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతున్నయన్నారు..ఈ రోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుందన్నారు..అందులో భాగంగా నేడు క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు చదువు పైనే కాకుండా క్రీడలలో కూడా బాగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రతి విద్యార్ధి క్రీడలను ఒక అలవాటుగా అలవర్చుకోవాలని కలెక్టర్, విద్యార్ధులకు సూచించారు.
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
This website uses cookies.