అమరావతి: కేంద్ర విద్యుత్ శాఖ తెలుగు రాష్ట్రాలతో సహా 13 రాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లను కేంద్రం విద్యుత్ శాఖ నిషేధించింది..రాష్ట్రాలు బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు..కేంద్ర విద్యుత్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రూ.1380 కోట్లు,,ఆంధ్రప్రదేశ్ రూ.412 కోట్లు,,తమిళనాడు రూ.924 కోట్లు,,రాజస్థాన్ రూ.500,,జమ్మూ కాశ్మీర్ రూ.434కోట్లు,, మహారాష్ట్ర 381,,చత్తీస్ గఢ్ రూ.274కోట్లు,,మధ్యప్రదేశ్ రూ.230 కోట్లు,,జార్ఖండ్ రూ.218 కోట్లు,,బీహార్ రూ.112 కోట్లు వంతున మొత్తం సుమారు రూ.5800 కోట్లు బకాయి పడినట్లు తెలిపింది..ఈ బకాయిలు చెల్లించలేదన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..ఈ నిషేధాన్ని శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది..ఇండియన్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (POSOCO) నుంచి విద్యుత్ కొనుగోలు చేయకుండా కేంద్ర విద్యుత్ శాఖ తీసుకున్ననిర్ణయంతో 13 రాష్ట్రాలు ఉల్కికి పడ్డాయి..కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయంపై ఉన్నతాధికారులు పరోక్షంగా స్పందించారు. 13 రాష్ట్రాలు మొత్తం 1 లక్షా 43వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కంలకు చెల్లిస్తే,,డిస్కంలు వెంటనే జెన్ కోల బకాయిలు చెల్లించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.